

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 03.06.2025: తెలంగాణ నీటి పారుదల శాఖ మాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వగ్రామమైన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ ప్రభుత్వ పాఠశాలలకు నూతన రూపురేఖలు రానున్నాయి. ఇటీవల మంత్రి స్వగ్రామ పర్యటనలో గ్రామస్థుల కోరిక మేరకు ఇచ్చిన హామీలలో బాగంగా 3 కోట్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR నిధులు పాఠశాల అభివృద్ధి పనులకు కేటాయించారు.

అట్టి హామీలు కార్యరూపం దాల్చడంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు D.E.O K. అశోక్, DE, AE రంగారావు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ శ్రీధర్ తదితరులు గ్రామాన్ని సందర్శించి స్థల పరిశీలన చేసి, కావలసిన సౌకర్యాలను సంబంధిత హెడ్ మాస్టర్ లు మాశెట్టి శ్రీనివాసులు, K. సత్తయ్య గార్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి హామీలు కార్యరూపం దాల్చున్నందున పేరెంట్స్, గ్రామస్థులు, గ్రామ పెద్దలు , యూత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




