

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి ప్రతినిధి, 03.06.2025: తిరుమలగిరి మండలంలోని జలాల్పురం శ్రీ సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు.

ఈ కేంద్రం నుండి సుమారుగా 11000 క్వింటాల ధాన్యాన్ని ఎగుమతి చేయడం జరిగిందని ఇంకా 2000 బస్తాలు మిగిలినవి, ఈరోజు సాయంత్రం కల్లా త్వరగా లారీల ద్వారా ఎగుమతి చేయాలని కలెక్టర్ ఏపిఎం మధుసూదన్ కు ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వెంట వెంటనే లారీలను పంపి ఎగుమతి దిగుమతులు సకాలంలో జరిగేటట్టుగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి వీవీ అప్పారావు, ఆర్డీవో మధుసూదన్, డిఎస్ఓ రాజేశ్వరరావు, ఐకెపి సిబ్బంది సోమేశ్వరి ఎలీషా భారతమ్మ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

