

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 02.06.2025: గుమ్మడిదల సర్వే నెంబర్ 109 భూమి విషయంలో న్యాయం జరిగే వరకు బాధిత రైతులకు తాను తోడుంటానని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు హరీష్ రావును కలిసి తమ సమస్యలు వివరించారు. రైతుల వేదన విన్న హరీష్ రావు వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో రైతుకు 600 గజాల భూమిని ఇవ్వాలని నిర్ణయించామని, దాని విలువ సుమారు 60 లక్షలు, నేటి ప్రస్తుత విలువ 2 కోట్లు ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా లగచర్లలో రైతులకు పరిహారం చెల్లించి ఉద్యోగాలు ఇచ్చినట్లు, అదే తరహాలో గుమ్మడిదల రైతులకూ న్యాయం జరగాలని కలెక్టర్ను కోరారు.

ప్రస్తుత ప్రభుత్వం పరిహారం అంశంలో గ్రామ పంచాయతీలో మూడు రెట్లు, మున్సిపల్ పరిధిలో రెండు రెట్లు ఇవ్వాలని చెబుతోందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత భూమి విలువ 7.5 లక్షల రూపాయలు కాబట్టి మున్సిపల్ ప్రాంతంగా 15 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. అయితే రైతుల అసలు నష్టానికి ఇది సరిపోదని, తగిన పరిహారం, ఉద్యోగంతో పాటు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రాష్ట్ర నాయకులు బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్, మండల పార్టీఅధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, రాజేష్, నాయకులు బాలకృష్ణారెడ్డి దేవేందర్ రెడ్డి, రాజశేఖర్, మంగయ్య, మల్లేష్ గౌడ్, సదానంద రెడ్డి, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి ఆంజనేయులు యాదవ్, సూర్యనారాయణ, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, మల్లేష్, మోహన్, బీరప్ప, నారాయణ యాదవ్, పెంటయ్య, రాజు,రైతులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




