

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 31.05.2025: రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు తప్పవని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈ రోజు సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మైనర్ల డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, త్రీబుల్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు, వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ వారం రోజులుగా మైనర్ల డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, త్రీబుల్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు.

ఇందులో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించకపోవడం వంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహానాలు ఇస్తే మైనర్లతో పాటు వాహన యజమానులు, మైనర్ల తల్లిదండ్రులపై కేసులు తప్పవని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్డు భద్రత అందరి భాధ్యతన్నారు. సమావేశం లో పోలీసు సిబ్బంది ఉన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




