
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 25.05.2025: నూతనంగా నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు. నెరవేరిన సొంత ఇంటి కల. సుమారు 25 వేల మందికి భోజన వసతి. దాదాపు నాలుగు దశాబ్దాలు అంటే 1989 నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఏక చక్రాధిపత్యం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇంతకాలానికి ఆయన సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దశాబ్దాలుగా తనను ఆధరించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చంద్రబాబు కుప్పంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. 1987 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభ సభ్యునిగా గెలుపొందుతున్నారు. సుదీర్ఘకాలం తరువాత కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంతింటి కల నెరవేరింది.

నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో పాలు పొంగిస్తున్న దృశ్యం
ఆదివారం వేకువజామున గృహప్రవేశం: కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయితీ శివపురం వద్ద 2 ఎకరాల్లో సీఎం చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆదివారం మే 25న వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్య శుభ ముహూర్తంలో సీఎం చంద్రబాబు-సతీమణి భువనేశ్వరి, ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్-సతీమణి నారా బ్రహ్మణి గృహ ప్రవేశం చేశారు. గోపూజ, పూజాది కార్యక్రమాలను చంద్రబాబు దంపతులు, నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి దంపతులు నిర్వహించారు.

25 వేల మందికి భోజనాలు: సీఎం చంద్రబాబు నూతన ఇంటి వేడుక సందర్భంగా కుప్పం నియోజకవర్గం మొత్తం ఇంటింటికి గృహ ప్రవేశ ఆహ్వానాన్ని అందించారు. నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు. నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సుమారు 25 వేల మందికి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెనూ ఏర్పాటు చేసి భోజనాలు సిద్దం చేశారు. గృహప్రవేశం అనంతరం ఆదివారం రాత్రికి నూతన గృహంలో బస చేయనున్నారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.
మీ ఆశీస్సులే మాకు దివెనలు-నారా లోకేష్: కుప్పం నియోజకవర్గ ప్రజలు 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో తమ సొంతింటి గృహప్రవేశం చేశామన్నారు. నియోజకవర్గ ప్రజలు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతుందని ఎక్స్ వేదికగా నారా లోకేష్ పోస్ట్ చేశారు. నూతన గృహప్రవేశం కేవలం మా కుటుంబ పండుగ కాదు, మన అందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనలు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. కుప్పం మా ఇల్లు, కుప్పం ప్రజలు మా కుటుంబం అన్న నారా భువనేశ్వరి. కుప్పం లో జరిగిన గృహప్రవేశ వేడుక ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు-సతీమణి నారా భువనేశ్వరి. ఇది హృదయ పూర్వక వేడుక, 36 సంవత్సరాలుగా మాకు మద్దతుగా నిలిచి, ప్రతి అడుగులో మమ్మల్ని నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీర్వాదం, వారి ప్రేమకు చాలా కృతజ్ఞతలు తెలిపారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




