
***నేటి నుండి రోహిణి కార్తే ప్రారంభం, రోహిణి కార్తె అంటే ఏంటీ?…
***రోహిణి కార్తే లో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?…

న్యూస్ 24అవర్స్ టివి-లైఫ్ స్టైల్, 25.05.2025: రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.
మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. రోళ్ళు పగులుతాయి అనేది సామెత మాత్రమే అంటే సంవత్సరం అంతా ఈ వేసవిలోనే ఎండల తీవ్రత ఎక్కువగా వుంటాయి కాబట్టి రోళ్ళు పగిలే ఎండలు అంటూ ఎండల తేడా కు ఎదాహరణా ఉచ్చరిస్తారు.
రోహిణి కార్తె లో ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.
నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి, తెల్లని రంగు కల్గినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.
ముఖ్యంగా సాటి జీవులైన పశు, పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి, మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలం, శీతాకాలం ఎలాగైనా గడిపేయొచ్చు కానీ ఎండాకాలంలో వేడిని, ఉక్కబోతను తట్టుకోవడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా వేసవి దెబ్బ మామూలుగా ఉండటం లేదు. ఉపరితల ఆవర్తనాల పుణ్యమా అని ఈ ఏడాది మాత్రం వేసవి నుంచి జాగ్రత్తగా గట్టెక్కేశాం. మేలో ఎండలు ఉంటాయి కానీ ఈ నెలలో సగభాగం వర్షాలతో గడిచిపోయింది. అందరికీ వరుణుడు రిలీఫ్ ఇచ్చినా రైతన్నలకు మాత్రం గోస మిగిల్చాడు. అదే బాధాకరం.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




