

న్యూస్ 24అవర్స్ టివి-జాజిరెడ్డిగూడెం ప్రతినిధి, 19.05.2025: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సీసీజీ ని సస్పెండ్ చేస్తూ, జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం-1వ గ్రామ సమాఖ్యలోని విఓఏ చంద్రకళ, కమిటీ సభ్యులు శైలజ, పద్మ, హైమవతి, లింగమ్మ లను విధుల నుండి పూర్తిగా తొలగించినట్టు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

తిమ్మాపురం గ్రామంలోని ఐకెపి వారు ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ సక్రమంగా నిర్వహించకుండా, విఓఏ చంద్రకళ వ్రాసిన ట్రక్ షీట్ లో కొట్టి వేతలు, కొనుగోలు పత్రంలో తప్పులు, ట్యాబ్ ఎంట్రీ కూడా ఇతరులు చేస్తున్నట్లు దృష్టిలోకి రావడం తో, పంపించిన ధాన్యంలో తూకంలో తేడాలు ఉండటం తో సంబధిత సిసిజి నగేష్ ను సస్పెండ్ చేస్తూ, విఓఏ ను మరియు కమిటీ సభ్యులు మొత్తాన్ని తొలగిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




