
***సంతాపం తెలిపిన జర్నలిస్టు సంఘాలు…
న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్ ప్రతినిధి, 19.05.2025: సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ మాజీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ సత్తార్ (65) అనారోగ్యంతో సొమవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కూతురు వున్నారు. హైదరాబాద్ లో దాదాపు 30 ఏళ్ళు వివిధ తెలుగు, ఉర్దూ పత్రికల్లో రిపోర్టర్ గా పని చేసిన అబ్దుల్ సత్తార్ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) కార్యవర్గ సభ్యుడుగా, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ డైరెక్టర్ గా పని చేశారు. గత రెండేళ్లుగా పెరాలసిస్ తో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. రామంతాపూర్ లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న అబ్దుల్ సత్తార్ బౌతిక కాయానికి ఈ రోజు సాయంత్రం వారి ఆచారం ప్రకారం రామంతాపూర్ మసీదులో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. 1995 నుంచి వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన అబ్దుల్ సత్తార్ అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ పేర్కొన్నారు. అబ్దుల్ సత్తార్ మృతికి వారు సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




