

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 12.05.2025: వేసవి సెలవుల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో గల జిల్లా పరిషత్ పాఠశాల నందు పిల్లలకు వేసవి ఉచిత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు మరియు జిల్లా బాల భవన్ ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు పిల్లల కోసం మరియు కాలనీ పిల్లల కోసం ఈరోజు ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించామని దీనిలో పిల్లలకు మేధస్సు, జ్ఞాపకశక్తి, ప్రయోగాత్మక విధానం పెంపొందించే విధంగా ప్రయోగాత్మక ఇంటలిజెన్స్, యోగ, క్రాప్ట్, మ్యూజిక్, కర్ర సాము, సాంప్రదాయ నృత్యం, సంగీత పరికరాలు, ఇండోర్ ఆటలు మొదలగు అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, పాఠశాల పిల్లలు ఎవరైనా ఈ శిక్షణను సద్వికినియోగం చేసుకోవచ్చని అన్నారు. పిల్లలు భావిభారత పౌరులు, బావి భారత పౌరులు దృఢంగా ఉండాలి, తల్లిదండ్రులు గురువులు చెప్పేది బుద్ధిగా నేర్చుకోవాలి, మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచే ఆటలపై దృష్టి పెట్టి అలాంటి ఆటలు ఆడుకోవాలి, పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. గురువుల నేర్పే సద్విధ్యాను జ్ఞాపక శక్తితో కూడిన అలవాట్లను మంచిగా నేర్చుకుని కృషిచేసి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అన్నారు.

పోలీసులు సమాజ రక్షణకోసం ఉన్నారు, సైనికులు నిజమైన హీరోలు అన్నారు, మద్యం మత్తులో వాహనాలు నడిపిన, దొంగతనాలు, అసాంఘిక చర్యలు, విద్యాసంస్థల్లో వేదింపులు ఇలా ఏవైనా స్థానిక పోలీస్ లకు, డయల్ 100 కు తెలపాలి అని విద్యార్థులకు తెలిపినారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఆపరేషన్ సిందూర్ ను ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసినది ఇద్దరు మహిళా అధికారులే. అంతరిక్షానికి వెళ్లి ప్రయోగాలు చేస్తున్నారు, పిల్లలు మంచి భవిష్యత్తులో స్థాయికి వెళ్ళాలని కోరుతున్నాను అన్నారు. కార్యక్రమం అనంతరం రిఫ్రెష్మెంట్ కోసం పిల్లలకు పండ్లు, బిస్కెట్ అందించారు. ఈ కార్యక్రమం లో AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP పార్థసారథి, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణా రెడ్డి, భాల భవన్ సభ్యులు రిటైర్డ్ అధ్యాపకులు అమిధ్ ఖాన్, యోగా గురువు, జిల్లా బాల భవన్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




