

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 11.05.2025: శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మెన్ బలరాం ఆధ్వర్యంలో రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీ షాపింగ్ సెంటర్లో లో చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్రపురం వార్తక సంఘం అధ్యక్షులు జైరామ్ వర్తక సంఘం కుటుంబ సభ్యులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

బలరాం మాట్లాడుతూ చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజలదాహార్తిని తీర్చేకేంద్రాలుగా సేవలందిస్తాయని శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు బలరాం తెలిపారు. చలివేంద్రాల తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను బాలాజీ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది.

ప్రతీ ఒక్కరు సమాజసేవలో భాగమై ప్రజలకు తమకు తోచిన విదంగా సహాయసహకారాలు అందించాలని వారు ఆశాభవం వ్యక్తపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ భూషణం రవికుమార్ ప్రమోద్ ప్రవీణ్ కుమార్ మధుసూదన్ రావు ప్రభాకట్ మహేష్ సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




