
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 09.05.2025: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో 19 లక్షల విలువైన చెక్కులు పంపిణి చేసిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) శుక్రవారం పంపిణి చేసిన సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి.

ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆసరాగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్ లో రూ. 19 లక్షల విలువైన 36 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడమేగాక, LOC లను పెద్ద సంఖ్యలో మంజూరు చేసి పేదలకు ఉపయోగపడే విధంగా చొరవ చూపించామన్నారు.

ఇప్పటి వరకు సూర్యాపేట నియోజకవర్గంలో మా ద్వారా రూ. 70 లక్షలకు పైగా LOC లను సహాయ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




