
న్యూస్ 24అవర్స్ టివి-వండర్స్, 09.05.2025: హిందువులు పూజలకు, వాహనాలకు నిమ్మకాయ కడితే మంచిది అని పూర్వము నుండి వస్తున్న సంప్రదాయం. తమిళులు లో నమ్మకాలు మనకంటే ఎక్కువే. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోడ్ జిల్లాలోని శివగిరిలో గల సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేశారు. ఈ వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కందసామిపాలెం నుంచి వచ్చిన ఒక భక్తుడు రూ. 25 వేలకు ఆ నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామి వారి పూజకు ఉపయోగించిన సామగ్రిని వేలం వేయడం ఆనవాయతీ అని ఆలయ అధికారులు తెలిపారు.
5,916 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




