

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్ ప్రతినిధి, 06.05.2025: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఇటీవల ఆకాలంగా మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడంలో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం లో రమేష్ కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారని అభినందించారు. పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సెప్షల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ నాగభూషణ రావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ ఆర్ ఎస్సై సాయిరాం, బరోసా సెంటర్ మహిళా ఎస్సై మౌనిక, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




