By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
News 24 hours tvNews 24 hours tv
Notification Show More
Font ResizerAa
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Reading: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి పై ప్రత్యేక కథనం-కల్లూరు హేమాద్రి
Share
Font ResizerAa
News 24 hours tvNews 24 hours tv
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Have an existing account? Sign In
Follow US
News 24 hours tv > Blog > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి పై ప్రత్యేక కథనం-కల్లూరు హేమాద్రి
ఆంధ్రప్రదేశ్

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి పై ప్రత్యేక కథనం-కల్లూరు హేమాద్రి

NAINI SREENIVASA RAO
Last updated: May 4, 2025 6:19 pm
NAINI SREENIVASA RAO
ByNAINI SREENIVASA RAO
C.E.O
C.E.O NEWS 24HOURS TV Phone: 9290999316
- C.E.O
Published May 4, 2025
Share
SHARE

న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 04.05.2025: అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో జరుపుతారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు, కార్యకలాపాలను తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం మండలి పర్వేక్షణలో జరుగుతాయి. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారంఈ ఏడాది మే 11 రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.

మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండోరోజు బండవేషం.
మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడో రోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. నాలుగో రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు.

స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది

నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీని కోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు.

పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

5,980 Views
NAINI SREENIVASA RAO

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316

You Might Also Like

Pithapuram svsn varma: పిఠాపురంలో పొలిటికల్ హీట్ హీట్, ఎస్వీఎస్ఎన్ వర్మకు ఈసారి నో ఛాన్స్-సోషల్ మీడియాలో రచ్చ మీడియాలో – News 24

భారీ వర్షాల ఎఫెక్ట్ …! శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద, తాజా పరిస్థితి ఇలా ఇలా … – News 24

కర్నూల్ నేరం: కర్నూలులో టీడీపీ నేత నేత దారుణ హత్య .. కత్తులతో కత్తులతో దాడి .. ప్రాణం తీసిన తీసిన ఆధిపత్య! – News 24

ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీ కీ, రెస్పాన్స్ రెస్పాన్స్ షీట్లు విడుదల – ఈ లింక్స్ తో డౌన్లోడ్ డౌన్లోడ్ డౌన్లోడ్ – News 24

జగన్ ఆన్ సైరెడ్‌డి: విలువలు, విలువలు, వ్యక్తిత్వం .. సాయిరెడ్డి, పార్టీ పార్టీ ఎంపీలపై జగన్ జగన్ జగన్ – News 24

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
Delhi ిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పూర్తి నివేదిక, జడ్జి క్యాష్ రోపై పత్రాలు చూడండి
latest-posts

సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకు చెబుతుంది – News 24

NAINI SREENIVASA RAO
NAINI SREENIVASA RAO
March 28, 2025
టోటెన్హామ్ యొక్క యూరోపా లీగ్ ఫైనల్ కంటే ముందే డెజన్ కుసేవ్స్కీ గాయంపై ఏంజె పోస్టెకోగ్లో ఆశాజనక – News 24
పోలావరం ఎడమ కాలువ: జూలై జూలై నాటికి గోదావరి జలాల తరలింపు తరలింపు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు. – News 24
పాకిస్తాన్ స్టార్ మొహమ్మద్ అమీర్ అతను 2026 నుండి ఐపిఎల్ ఆడటానికి 'అర్హత' అని చెప్పాడు. మాజీ టీమ్ మేట్: “ఆర్‌సిబికి అతనికి అవసరం” – News 24
ఫార్ములా కేసులో కేసులో నోటీసులు నోటీసులు… ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు నోటీసులు – News 24
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

News24 Live TV for the latest breaking news, current updates, and top stories from India and around the world.
Quick Link
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by News 24 Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Share

Facebook

X

LinkedIn

WhatsApp

Copy Link
×
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?