

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరు ప్రతినిధి, 03.05.2025: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామంలోని 1వ సర్వే నెంబరు గల భూమిని కాపాడాలంటూ మండల తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన కిష్టారెడ్డిపేట దళిత వాడ నాయకులు, ప్రజా ప్రతినిధులు. సుమారు 60 సంవత్సరాల నుండి మాల మాదిగ దళితవాడ నాయకుల సమాధులు ఉంటున్న 1వ సర్వే నెంబర్ యొక్క స్థలాన్ని కొందరు మైనార్టీ, కటిక సోదరులు కలిసి ఆ యొక్క స్థలాన్ని అర్థరాత్రి సమయంలో జెసిబి తో ఆ యొక్క సమాధులను తొలగించడం జరిగింది. దళితవాడ సంఘ నాయకులు వెంటనే చేరుకొని ఆ యొక్క అన్యక్రాంతమైన భూమిని వెంటనే కాపాడాలని గ్రామ పెద్దలను సైతం కోరుతూ మండల అధికారి తహసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఇట్టి విషయంపై తహసిల్దార్ వెంటనే స్పందించి సమాచారం మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బందిని వెంటనే స్థలం పరిశీలించేందుకు పంపించి హద్దులు నిర్ణయించి వాటి యొక్క రెండు రోజుల్లో స్థలం యొక్క వివాదాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి ఎవరిది వారికి తేల్చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ, టీ మాణిక్యం, బి రాములు, కృష్ణ, చీమలదారి ముత్యాలు, జంగులు, కే దుర్గయ్య, బి అశోక్, నర్సింగరావు, బిక్షపతి, శివ ప్రకాష్, దుర్గయ్య, దర్శన్, బాబురావు, మురళి, ప్రశాంత్, చిట్టి ప్రవీణ్, చిన్న, బి రాజు, శ్రీకాంత్, రామస్వామి, బి రవి, రాందాస్, ఈ లింగం, అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




