

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చేరు ప్రతినిధి, 25.04.2025: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండ పోసాని పల్లి ఉన్నత పాఠశాలలో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకటేష్ దిగంబర్ పిల్లలకు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 24న ప్రారంభమైన శిబిరం ఈనెల 30 వరకు కొనసాగుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ శిబిరంలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల విద్యార్థులు పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరం కొనసాగుతుంది ఈ సందర్భంగా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా పిల్లలకు ఆడిస్తున్నారు 24వ తారీఖు నాడు 60 మంది విద్యార్థులు హాజరుకాగా నేడు 80 మంది విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316



