
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 11.03.2025: తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం నాడు పుష్పగిరి కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసు మాట్లాడుతూ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సూర్యాపేట జనగామ జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు కంటి చూపును ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండెపురి మాజీ ఉపసర్పంచ్ పెరుమాండ్ల జానీ, గుండెపురి గ్రామ స్వచ్చంద సంస్థ నాయకులు కొమ్ము సోమన్న బలికే నాగేష్, మేడే మారయ్య ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




