
అనర్హులే టార్గెట్..
అనర్హులకు కాల్ చేసి ఓటీపీ అడుగుతున్నారు. ఓటీపీ చెబితే వెంటనే రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాలకు అర్హులవుతున్నారని నమ్ముతున్నారు. ఇల్లెందు పట్టణంలోని పలువురికి మెసేజ్లు రావడం కలకలం సృష్టించింది. వారు అప్రమత్తమై వెంటనే మెసేజ్ డిలీట్ చేయడంతో.. సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇటువంటి మెసేజ్లు చేయదని, ఓటీపీలు అడగదన్న విషయాన్ని గుర్తించాలి. తెలియని వారు మెసేజ్లపై క్లిక్ చేసి, ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంది.
5,959 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




