
రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి రూ.702 కోట్ల బకాయిలు కార్పొరేషన్ విడుదల చేయకపోవడం, ధరలు సవరించాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేఎఫ్ బీర్ల సరఫరాను యూబీఎల్ కంపెనీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆరు బీర్ల తయారీ సంస్థలున్నాయి. అయితే మార్కెట్ లోకి వచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్ కంపెనీదే. యూబీఎల్ బీర్ల సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీనితో మద్యం ధరల పెంపుపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ, తగిన ధరలపై నిర్ణయం తీసుకుంటామని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ బీర్ల సరఫరాను సిద్ధం చేసింది.
5,956 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




