హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్ మరియు జాతవత్ బాబు నాయక్ లు ఒక సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుడిని నుండి తీసుకుంటుండగా ఎల్.బి. నగర్ చౌరస్తా వద్ద తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం వారిని పట్టుకున్నారు.
2026-03-10











